తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 15 తెలుగు వెలుగు : జూలూరుపాడు మండల ప్రధాన రహదారి పై మండలంలోని ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి మానవహారం గా ఏర్పడి రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి విద్యార్థులు, ఉన్నతాధికారులచే నా భద్రత నా బాధ్యత ప్రజల భద్రత మనందరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేయించారు. టు వీలర్ దారులు హెల్మెట్ తప్పక వినియోగించాలని, ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ ను వినియోగించాలని,మద్యం సేవించి వాహనం నడప రాదని, మొబైల్ ఫోన్ చూస్తూ, అతి వేగంగా, రాంగ్ రూట్ లో వాహనాలు నడప రాదని ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా 50% వరకు ప్రమాదాలు తగ్గించవచ్చునని పలు రకాల సూచనలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, తాసిల్దార్ టి శ్రీనివాసరావు, మండలఅభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, మండల విద్యాధికారి జుంకీలాల్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య, స్థానిక పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ