తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 20) : జూలూరుపాడు జిల్లా ప్రాథమిక పాఠశాలలలో, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు కలిసి వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలు పాఠశాలల సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతాయి మరియు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతాయి. సంబరాలు మహిళా ఉపాధ్యాయురాలు మరియు బాలికలు చాలా సంతోషంగాను ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని సీనియర్ సహో ఉపాధ్యాయులు శ్రీ రామిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగినది. తదుపరి శ్రీరామ్ శెట్టి శ్రీనివాసరావు తాను చదువుకున్న పాఠశాలకు వితరణగా బ్లూటూత్ సౌండ్ సిస్టం ను పాఠశాలకు డొనేట్ చేయడం జరిగినది అందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా శ్రీనివాసరావు కి ధన్యవాదాలు తెలియజేశారు. సార్ కి పాఠశాల మీద ఉన్న మమకారం ప్రేమ గౌరవం ఆప్యాయత అనురాగాన్ని పిల్లల మధ్య తను ఆనంద భాష పాలతో తన సంతోషాన్ని వెల్లబుచ్చారు మరి కొద్ది రోజు మరి కొన్ని నెలల్లో రిటైర్మెంట్ కాబోతున్న తరుణంలో మరి వారు సబ్జెక్టులలో గత ఐదు సంవత్సరాల నుండి మ్యాచ్ సబ్జెక్టులో 100 కి 100% ఫలితాలు సాధిస్తూ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తనకు పాఠశాల మీద ఉన్న మమకారాన్ని చాటుతున్నారు ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు సందర్భంగా అందరూ కలిసి సార్ని ఘనంగా సన్మానించి తదుపరి బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ