Saturday, 19 September 2026 09:53:18 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

పాల్వంచ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 10 March 2026 02:27 PM Views : 249

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు . మంగళవారం పాల్వంచ పట్టణంలోని ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి బోధన విధానం, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఐదో తరగతి విద్యార్థుల చదివే నైపుణ్యాన్ని పరీక్షించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం పాఠశాల మెస్‌, స్టోర్‌రూమ్‌, డైనింగ్ హాల్‌లను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను తనిఖీ చేశారు. మెస్ మానిటర్లుగా ఉన్న విద్యార్థులతో పాటు వంట సిబ్బందితో మాట్లాడి మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నందుకు వంట సిబ్బందిని అభినందించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాల అమరికను ప్రశంసించారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయానికి పుస్తకాలను అందించేందుకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల తలుపుల మరమ్మత్తులు, డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్య పరిష్కారం, డైనింగ్ హాల్‌లో విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను కలెక్టర్ అభినందించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైతిలి, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :