Thursday, 17 September 2026 08:45:42 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

57 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ముఖ్య అతిధి కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 05 September 2025 08:02 PM Views : 774

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి బి నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులు గా నేర్చుకుంటూనే తరగతి గది లో విద్యార్థుల సర్వతోముఖభి వృద్ధి కై పాటుపడాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు ప్రతీ విషయాన్నీ తాము ముందుగా చదువుకొని విషయం పై పట్టు పెంచుకోవాలన్నారు. విద్యార్థులు హోంవర్క్ చేసేలా చూడాలన్నారు.విశిష్ట అతిధి అశ్వారావుపేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడుగా వృత్తిని చేసిన రోజులను స్మరించుకుంటూ, ఉపాధ్యాయుల బోధనా విధానాలను బట్టే విద్యార్థులు వారి జీవితాల్లో చిరస్థాయి గా గురువులను గుర్తుంచుకుంటారని అన్నారు. తాను విద్యార్థిగా, ఉపాధ్యాయుడుగా ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నని పనిచేసానని, రాష్ట్ర, దేశ స్థాయి లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా అని అన్నారు. శాసన సభ్యులుగా ఎదగటానికి నాకు పేగుబంధం వున్న ఉపాధ్యాయులు ఎంతో సహకరించారని అన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు అందరు తన దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయులే అన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చెర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విద్య పై మంచి విజన్ వున్నదని, విద్యాశాఖాను తన దగ్గరే ఉంచుకొని ప్రత్యేక సంస్కరణలు తెస్తున్నారు అని అన్నారు.జిల్లా విద్యాశాఖాదికారిణి నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం లు చేయటానికి మండలం స్థాయిలో 5000 రూపాయలు, జిల్లా స్థాయిలో 15000 రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేసారని, జిల్లా వ్యాప్తంగా 57 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ను గుర్తించి వారికి శాలువా, ప్రశాంస పత్రము, జ్ఞాపిక లను అందచేస్తున్నట్లు తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు.నాకు గురువు ఈ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అని కొనియాడారు. నేను ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నానని ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నానని ఇప్పటికే ఈ కలెక్టర్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమం తో పాటుగా జిల్లా కలెక్టర్ నిర్దేశించిన విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 23 మండలాల లోని ప్రథమ స్థానంలో నిలిచిన 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగినది. కార్యక్రమం ప్రారంబానికి ముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన స్వాగత నృత్యాలు అద్భుతంగా అలరించాయి.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ లు నాగరాజ శేఖర్, సైదులు, సతీష్, అన్నమణి, పరీక్షల విభాగం అధికారి మాధవరావు, డి సి ఇ బి సెక్రెటరీ నీరజ, కొత్తగూడెం MEO మధురవాణి, ప్రధానోపాధ్యాయులు పద్మలత , రమాదేవి, కార్యక్రమ నిర్వహణ బాధ్యులు జంకిలాల్, బాలాజీ, నరేష్, ప్రేమ్. ప్రెస్ ఇంచార్జ్ షేక్ దస్తగిరి,. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :