తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ఈ అనంతారం గ్రామంలో అధికస్తులు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి విధానంలో మార్పులు రావాలని తగు సూచనలు ఇచ్చారు అదేవిధంగా తాగేటువంటి నీరు నీటి నమూనాను సేకరించి పరీక్షించడం జరిగింది. త్రాగునీరు శాంపిల్స్ సాధారణంగా నిర్ధారణ అయినది. త్రాగు నీటిలో ఏ విధమైనటువంటి క్లోరైడ్ గానీ ఫ్లోరైడ్ గాని బార లోహాలు అయినటువంటి lead గాని Lithium గాని లేవని తేలింది. అదేవిధంగా పంచాయతీ శాఖతో కలిసి ఇంకా తగు 10 రకాల నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రక్తపు నమూనాలను కూడా సేకరించమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు మద్యం, పాను, గుట్కాలు, జర్దాలు బారినపడకుండా మెరువైనటువంటి జీవన విధానాలను పాటించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగాRmp pmp luవారి వారి స్థాయిని మించి వైద్యం చేయరాదని ఆదేశించడం జరిగింది. అధికంగా యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఒకే రోజు రెండు మూడు డోసులు సిఫారసు చేయడం పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఎక్కువగా ఇవ్వడం స్థిరాయిడ్ ఇంజక్షన్లు ఇవ్వడం ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం వారి స్థాయికి మించి వైద్యం ఇవ్వడం వలన కిడ్నీలు త్వరగా డ్యామేజ్ అయ్యే ఎటువంటి ప్రమాదం ఉంది.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ , జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ NCD డాక్టర్ మధు వరుణ్ , మండల వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వర్లు ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు రామకృష్ణ , ANm సావిత్రి మరియు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ