తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు న్యూ ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్, ప్రవాసీ భారతీయ కేంద్రం, మాల్చా లో నిర్వహించిన “అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు బ్లాక్స్ ప్రోగ్రాం (ADP-ABP 2.0) భవిష్యత్ దిశ” వర్క్షాప్-కమ్-మీటింగ్ కు హాజరయ్యారు. NITI Aayog ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ప్లానింగ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఆకాంక్షిత జిల్లా మరియు ఆకాంక్షిత మండల ప్రోగ్రామ్లలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, ప్రాథమిక సదుపాయాలు వంటి రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఈ పురోగతిని సాధించటానికి ఎదుర్కొన్న సవాళ్లను చర్చించి, భవిష్యత్ దశల్లో కీలకమైన అభివృద్ధి సూచికలను సంపూర్ణంగా సాధించటానికి అవసరమైన చర్యలను పరిశీలించారు. రాష్ట్రాల ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఎదురయ్యే అడ్డంకులు, కావలసిన నూతన విధానాలపై కూడా చర్చలు జరిగాయి. అదేవిధంగా, ఏప్రిల్ 2026 నుండి అమలులోకి రానున్న ADP, ABP 2.0 కార్యక్రమాల రూపకల్పన పై సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకాంక్షిత జిల్లా మరియు ఆకాంక్షిత మండల ప్రోగ్రామ్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అనుభవాలను పంచుకున్నారు. అలాగే, తదుపరి దశల్లో జిల్లాకు అవసరమైన ప్రాధాన్యతా అంశాలను వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ