తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా తరగతులు.సమకాలీన రాజకీయ అంశాలపై ప్రముఖుల విస్తృత బోధన.రాజకీయ శిక్షణా తరగతులతోనే పార్టీ సిద్ధాంత పరిపుష్టి.300 మంది ఇరు జిల్లాల సమితి సభ్యులకు శిక్షణ.సిపిఐ శ్రేణులు శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.భద్రాచలంలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా రాజకీయ శిక్షణా తరగతులు జరగనున్నాయని, సమకాలీన రాజకీయ అంశాలపై ప్రముఖులు ఇందులో విస్తృత బోధన చేయనున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సమితి సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులు భద్రాచలంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో అయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ శిక్షణా తరగతులతోనే పార్టీ సిద్ధాంత పరిపుష్టి, బలోపేతం సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక శిక్షణా తరగతులలో ఇరు జిల్లాల నుంచి సుమారు 300 మంది సమితి సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ శిక్షణా తరగతులను సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభించనున్నారని, ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొననున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ తరగతులలో ప్రొఫెసర్ యుగల్ రాయలు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మోహన్ రెడ్డి, సోమసుందర్, ఎస్ వేణుగోపాల్, కె శ్రీనివాసరెడ్డి, చలసాని వెంకట రామారావు, భాగం హేమంతరావు, వి మల్లికార్జున్ రావులు పలు ముఖ్యమైన అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడే ఈ శిక్షణా తరగతులను సిపిఐ శ్రేణులు, సమితి సభ్యులు హాజరై విజయవంతం చేయాలని సాబీర్ పాషా పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ