Sunday, 02 August 2026 02:26:58 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచలంలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా తరగతులు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 05 July 2026 07:02 PM Views : 80

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా తరగతులు.సమకాలీన రాజకీయ అంశాలపై ప్రముఖుల విస్తృత బోధన.రాజకీయ శిక్షణా తరగతులతోనే పార్టీ సిద్ధాంత పరిపుష్టి.300 మంది ఇరు జిల్లాల సమితి సభ్యులకు శిక్షణ.సిపిఐ శ్రేణులు శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.భద్రాచలంలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా రాజకీయ శిక్షణా తరగతులు జరగనున్నాయని, సమకాలీన రాజకీయ అంశాలపై ప్రముఖులు ఇందులో విస్తృత బోధన చేయనున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సమితి సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులు భద్రాచలంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో అయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ శిక్షణా తరగతులతోనే పార్టీ సిద్ధాంత పరిపుష్టి, బలోపేతం సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక శిక్షణా తరగతులలో ఇరు జిల్లాల నుంచి సుమారు 300 మంది సమితి సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ శిక్షణా తరగతులను సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభించనున్నారని, ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొననున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ తరగతులలో ప్రొఫెసర్ యుగల్ రాయలు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మోహన్ రెడ్డి, సోమసుందర్, ఎస్ వేణుగోపాల్, కె శ్రీనివాసరెడ్డి, చలసాని వెంకట రామారావు, భాగం హేమంతరావు, వి మల్లికార్జున్ రావులు పలు ముఖ్యమైన అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడే ఈ శిక్షణా తరగతులను సిపిఐ శ్రేణులు, సమితి సభ్యులు హాజరై విజయవంతం చేయాలని సాబీర్ పాషా పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :