తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 28 తెలుగు వెలుగు) ఇంటర్ ప్రశ్నా పత్రాల తరలింపు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించాలి,పరీక్ష కేంద్రాలకు ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదు,ఇంటర్ పరీక్షల నిర్వహణ, పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని అన్నారు. ప్రశ్నాపత్రాలు తరలింపు పోలీసు బందోబస్తు మధ్య ఉంటుందని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని, అవసరమైన మేర ఫ్లయింగ్ స్క్వార్డులను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. పరీక్షలు నిర్వహించి సంబంధిత జవాబు పత్రాలు పోస్టల్ ద్వారా పంపే వరకు వరకు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, సండే పంపు లోపల జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్ కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దని సీఎస్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదని సిఎస్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన త్రాగు నీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ* మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ పరీక్ష ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాల లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సంవత్సరం కొత్తగా ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు గాను చీఫ్ సూపర్డెంట్ అధికారులు 36 మంది అడిషనల్ చీఫ్ సూపర్డెంట్లు 13 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 36 మంది, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మూడు, కస్టోడియన్ అధికారులు 5 గురు, ఇన్విజిలేటర్లు 550 మంది మరియు టు ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. విధులు నిర్వహించే చీప్ సూపర్నెంట్ ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలు కస్ట్రోడియన్ అధికారులు మరియు డిపార్ట్మెంట్ అధికారులకు ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య సహాయం అందించడానికి గాను 72 మంది ఏఎన్ఎం లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ