Sunday, 07 June 2026 09:50:30 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహింఛాలి,రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి

Date : 28 February 2025 09:09 PM Views : 605

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 28 తెలుగు వెలుగు) ఇంటర్ ప్రశ్నా పత్రాల తరలింపు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించాలి,పరీక్ష కేంద్రాలకు ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదు,ఇంటర్ పరీక్షల నిర్వహణ, పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని అన్నారు. ప్రశ్నాపత్రాలు తరలింపు పోలీసు బందోబస్తు మధ్య ఉంటుందని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని, అవసరమైన మేర ఫ్లయింగ్ స్క్వార్డులను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. పరీక్షలు నిర్వహించి సంబంధిత జవాబు పత్రాలు పోస్టల్ ద్వారా పంపే వరకు వరకు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, సండే పంపు లోపల జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్ కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దని సీఎస్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదని సిఎస్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన త్రాగు నీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ* మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ పరీక్ష ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాల లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సంవత్సరం కొత్తగా ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు గాను చీఫ్ సూపర్డెంట్ అధికారులు 36 మంది అడిషనల్ చీఫ్ సూపర్డెంట్లు 13 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 36 మంది, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మూడు, కస్టోడియన్ అధికారులు 5 గురు, ఇన్విజిలేటర్లు 550 మంది మరియు టు ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. విధులు నిర్వహించే చీప్ సూపర్నెంట్ ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలు కస్ట్రోడియన్ అధికారులు మరియు డిపార్ట్మెంట్ అధికారులకు ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య సహాయం అందించడానికి గాను 72 మంది ఏఎన్ఎం లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :