తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండు రోజుల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు బయోచార్ ఎరువుల తయారీ పై రైతులకు అవగాహన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. గ్రామ, మండల మరియు జిల్లాస్థాయిలో 50,000 నుండి నాలుగు లక్షల రుణ సహాయం వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రానున్న రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి త్వరితగతిన అర్హుల జాబి తా రూపొందించాలన్నారు. ఇంకా ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన మిగిలి ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జల్ సంచాయ్ జన్ భాగీ దారి కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టామన్నారు. అదేవిధంగా ఇంకా ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పౌండ్ నిర్మాణాలు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న వర్షాకాలంలో ఒక్క చుక్క వర్షపు నీరు కూడా వృధాగా పోకుండా ఒడిసిపట్టే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫామ్ పౌండ్స్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. దీని ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుందని అవగాహన కల్పించాలన్నారు. నిర్మించిన ప్రతి ఇంకుడు గుంత చుట్టూ జూన్ నెలలో ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు చెట్టు గానుగ, మందారం వంటి మొక్కలను విస్తృతంగా నాటాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రైతులకు బయోచార్ తయారీ మరియు ఉపయోగాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. బయో చార్ తయారీ కోసం గుంత త్రవ్వి దానిలో చెక్క, ఆకులు వంటివి కాల్చడం ద్వారా మంచి నాణ్యమైన బొగ్గు భవిస్తుందని వాటిని ఆవు మూత్రం మరియు పేడలో రెండు నెలలపాటు ఉంచితే మంచి ఎరువు తయారవుతుందని దీని ద్వారా భూమి సారవంతం అవ్వడమే కాకుండా ఎటువంటి రసాయనిక పదార్థాలు లేకుండా అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు. మండల, పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెట్లు తొలగించి జామాయిల్ మొక్కలు నాటాలి అన్నారు దీని ద్వారా, మరుగు మరియు పారిశుద్ధ్య కార్మికుల శ్రమ తగ్గుతుందన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ఉన్న పడిపోయిన చెట్లను ఉపయోగించి బయోచార్ పద్ధతి ద్వారా ఎరువులు తయారు చేస్తే రైతులు వారి వద్దకే వచ్చి నిర్ణీత రుసుం చెల్లించి ఎరువు ను కొనుగోలు చేస్తారని దీని ద్వారా అందరికీ ఉపయోగం చేకూరుతుందన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ