తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 21 తెలుగు వెలుగు) జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించే టీచర్లు పదవ తారీకు నుండి సమ్మెలో ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదు అందువల్ల విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. వారు మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి, పాఠశాలలో పరీక్షల టైం లో టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ