తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాలోని ఉదయం జే.వి.ఆర్ సి.హెచ్.పి లోని ఉద్యోగులకు సాయంత్రం జిఎం ఆఫీస్ ఉద్యోగులకు, జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ తేదీ.12.08.2025 నుండి 14.08.2025 వరకు మరియు 16.08.2025 & 18.08.2025 రోజులలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం మన కొత్తగూడెం ఏరియా నందు జరుపుకుంటున్నట్లుగా అందులో భాగంగా ఈ రోజు ఉదయం జే.వి.ఆర్.సి.హెచ్.పి ఉద్యోగులకు సాయంత్రం జిఎం ఆఫీస్ ఉద్యోగులకు, జిఏం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, బొగ్గు వినియోగత పెరిగినందువలన నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేసి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును రవాణా చేసి సంస్ధ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో అధిగమించి సంస్ధ అభివృద్ధికి తోడ్పడాలని మన సంస్థ, మన గని మన బాధ్యతలను వివరించే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్థ యొక్క స్థితిగతులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని, నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుదాం సంస్థను ముందుకు తీసుకుపోదాం అని తెలియజేయడం జరిగింది. అనంతరం డిజిఎం (ఐఈడి) ఎన్.యోహాన్ మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం యొక్క ఉద్దేశమును అనగా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, మిషనరీ పనితనం, ఉత్పత్తి వ్యయం మరియు ఉద్యోగుల సంక్షేమ కొరకు సింగరేణి సంస్థ తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన ఉద్యోగులందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎం తో పాటు ఎజిఎం (ఫైనాన్స్) కే. హనా సుమలత, ఏరియా ఇంజనీర్ కే.సూర్యనారాయణ రాజు, డిజిఎం (ఐఈడి) ఎన్.యోహాన్, డిజిఎం(పర్సనల్)జి.వి.మోహన్ రావు, డిజిఎం (ఈ&ఎం) కే సోమశేఖర్ రావు, సీనియర్ పిఓ ఎం.మురళి, ఎస్ఈ (ఐఈడి) కే.ఆర్ నాగభూషణం, వివిధ విభాగాల అధిపతులు, ఇతర ఉద్యోగులు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ