తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 15న సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణ – గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యూనియన్ నాయకుల వెల్లడి. సింగరేణి కార్మికుల వైద్య సంబంధిత పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈనెల 15వ తేదీన సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహించనున్నట్లు గుర్తింపు సంఘం యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనియన్ ప్రతినిధులు యాజమాన్యంతో పలు దశల్లో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్నివ్వడంతో మెడికల్ బోర్డు నిర్వహణకు యాజమాన్యం అంగీకరించినట్లు వారు వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ