Monday, 03 August 2026 10:25:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్ర తనిఖీలు - అశ్వరావుపేటలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన

Date : 07 April 2026 04:15 PM Views : 125

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతిపాదిత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి వాటి నాణ్యతను సమీక్షించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించి, నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేస్తూ సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చింతపండు, కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించి ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని ముందుగా పూర్తిగా పరిశీలించిన తర్వాతే అందించాలని, ఇందుకు 8,9,10 వ తరగతి విద్యార్థులను కూడా ఆహార పరిశీలనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. తరగతి గదిలో 6 వ, 7వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, చికెన్ ఎన్ని సార్లు పెడుతున్నారు,ఆహార నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయంపై సిబ్బందిని ప్రశ్నించారు. గ్యాస్ సరఫరా, వంటశాల నిర్వహణ, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకొని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో మెనూ పాటించని పరిస్థితులు తమ దృష్టికి వచ్చిందని అలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఔట్ పేషెంట్ విభాగం, వార్డులు, రక్త పరీక్ష కేంద్రం, మందుల నిల్వ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే వెంటనే ఇండెంట్ చేయాలని సూచించారు ఆరోగ్యశ్రీ సేవల విభాగాన్ని పరిశీలించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్, ఎక్స్-రే విభాగాలను పరిశీలించిన సందర్భంగా సేవల్లో ఆలస్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ టెక్నీషియన్‌ల కొరత ఉన్నట్లు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇన్ పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి,ఆహారం తయారు చేసే ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతి రోగికి ఆహారం కోసం ఎంత నిధులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్ను అడగగా 80 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందించాల్సిన పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు కనిపించకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే పేదవారికి ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం కోసమే ప్రభుత్వం ఈ భోజనాన్ని అందిస్తుందని దానికి అనుగుణంగా ప్రతి రోగికి నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించడం అధికారుల బాధ్యత అన్నారు. వైద్యశాఖ అధికారులు రోగులకు అందించే ఆహారం పై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, చేరువ మార్గాలు, మౌలిక వసతుల లభ్యత వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఆర్‌ఎంఓ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు సంగీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :