Wednesday, 16 September 2026 09:53:25 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సమ్మె నోటీసు ప్రభావం.. పలు కీలక డిమాండ్లపై యాజమాన్యం అంగీకారం

Date : 03 September 2026 03:19 PM Views : 75

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ పోరాటంతో కార్మికులకు కీలక ప్రయోజనాలు - కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, నిరంతర పోరాటం ఫలితంగా సింగరేణి యాజమాన్యం పలు కీలక డిమాండ్లపై అంగీకారం తెలిపిందని ఏఐటీయూసీ కార్పొరేట్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌.వి. రమణమూర్తి తెలిపారు. గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.జూన్‌ 8న ఏఐటీయూసీ సమ్మె నోటీసు ఇచ్చిందని, అనంతరం యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించామని తెలిపారు.ఏఐటీయూసీ ఒత్తిడితో కార్మికులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే పలు అంశాలపై అగ్రిమెంట్లు జరిగాయన్నారు.ప్రధానంగా పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను యాజమాన్యమే భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం, 2025–26 వాస్తవ లాభాల ప్రకటన, ట్రాన్స్‌ఫర్ల మూడేళ్ల నిబంధనలో మార్పు, అర్హులైన మైనింగ్‌ స్టాఫ్‌, మైనింగ్‌ సర్దార్లకు ఓవర్‌మెన్‌ ప్రమోషన్లు వంటి అంశాలపై అంగీకారాలు సాధించామని పేర్కొన్నారు.అలాగే హైదరాబాద్‌లో సింగరేణి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనల్లో మార్పులు, సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించే అంశాలపై కూడా అంగీకారం కుదిరిందన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్‌ స్కీమ్‌ సమస్యల పరిష్కారం, మెడికల్‌ ఫిట్‌ అయిన 149 మంది డిపెండెంట్లకు నెలలోపు ఆఫీస్‌ ఆర్డర్లు జారీ చేయడం, సొంత ఇంటి పథకం, సేఫ్టీ మెటీరియల్‌ సరఫరా, సూటబుల్‌ సర్ఫేస్‌ ఉద్యోగాలు తదితర అంశాలపై కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.కొత్త గనులతోనే సింగరేణి భవిష్యత్తు సింగరేణి సంస్థ అభివృద్ధికి రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, కొత్త బొగ్గు గనులు కేటాయించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రమణమూర్తి కోరారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి చురుగ్గా పాల్గొని కొత్త బ్లాకులు సంస్థకు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు.కొత్త గనులు,ఉపాధి అవకాశాలు, కార్మిక సంక్షేమం,ఉద్యోగ భద్రతతోనే సింగరేణి భవిష్యత్తు బలోపేతమవుతుందన్నారు.కార్మికుల సమస్యలను ప్రచారానికే పరిమితం చేయకుండా పోరాటాల ద్వారా పరిష్కారాలు సాధించడమే ఏఐటీయూసీ విధానమని స్పష్టం చేశారు.ఏఐటీయూసీ సాధిస్తున్న విజయాలను కొన్ని సంఘాలు ఓర్వలేక విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ నితిన్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :