Saturday, 18 April 2026 09:11:22 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

యాసంగి వరి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి.- అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 18 April 2026 06:50 PM Views : 63

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాసంగి 2025-26 ధాన్యం కొనుగోలు పై అదనప కలెక్టర్ వేణుగోపాల్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, అప్రమత్తతతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 83,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలించి, అర్హమైన ధాన్యానికి మాత్రమే కొనుగోలు పత్రాలు, టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు రైతులు తెస్తున్న PR-126 వరి రకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రకంలో పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్య కారణంగా ఎఫ్‌సీఐ వద్ద బియ్యం ఆమోదం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ఎఫ్‌సీఐ వద్ద బియ్యం సజావుగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలు రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో రైతులు ఎండల సమయంలో కేంద్రాలకు రాకుండా, వాతావరణం చల్లబడిన తర్వాత ధాన్యాన్ని తీసుకురావాలని అవగాహన కల్పించాలని అన్నారు.రైస్ మిల్లర్లు తమ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతికి అవసరమైన హమాలీలు, గోదాం స్థలాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు వరి కొనుగోలు సిబ్బందికి శిక్షణ అందించి, సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విద్య చందన, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. ప్రేమ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి త్రినాధ్ బాబు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, ఎఫ్‌సీఐ అధికారులు వెంకట రమణ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :