Sunday, 07 June 2026 07:44:11 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

యాసంగి వరి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి.- అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 18 April 2026 06:50 PM Views : 243

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాసంగి 2025-26 ధాన్యం కొనుగోలు పై అదనప కలెక్టర్ వేణుగోపాల్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, అప్రమత్తతతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 83,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలించి, అర్హమైన ధాన్యానికి మాత్రమే కొనుగోలు పత్రాలు, టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు రైతులు తెస్తున్న PR-126 వరి రకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రకంలో పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్య కారణంగా ఎఫ్‌సీఐ వద్ద బియ్యం ఆమోదం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ఎఫ్‌సీఐ వద్ద బియ్యం సజావుగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలు రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో రైతులు ఎండల సమయంలో కేంద్రాలకు రాకుండా, వాతావరణం చల్లబడిన తర్వాత ధాన్యాన్ని తీసుకురావాలని అవగాహన కల్పించాలని అన్నారు.రైస్ మిల్లర్లు తమ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతికి అవసరమైన హమాలీలు, గోదాం స్థలాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు వరి కొనుగోలు సిబ్బందికి శిక్షణ అందించి, సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విద్య చందన, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. ప్రేమ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి త్రినాధ్ బాబు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, ఎఫ్‌సీఐ అధికారులు వెంకట రమణ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :