Thursday, 17 September 2026 09:08:17 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 28 May 2026 05:15 PM Views : 224

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలి.త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ.కలిసిమెలిసి ఉంటూ మతసామరస్యాన్ని చాటాలి.గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే మైనార్టీ సోదరుల ఆలోచన ఆదర్శం.మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.అందరి శ్రేయస్సు కోరుతూ జరుపుకునే పండుగ ఇది.సమైక్యతతోనే దేశం మరింత ముందుకు సాగుతుంది.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బోడగుట్ట ఏరియాలో ఉన్న ఈద్గాను ఆయన సందర్శించి, అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదర కుటుంబాలను కలిసి వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని, అందరూ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మైనార్టీ సంఘం నాయకుడు కోరడం అత్యంత అభినందనీయమని, ఇది ముస్లింల ఉదార స్వభావానికి నిదర్శనమని శ్లాఘించారు. ఈ ప్రతిపాదనను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇలాంటి ఆలోచనలు సమాజంలో మతసామరస్యాన్ని మరింత పెంపొందిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పండుగ రోజున అందరి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, మైనార్టీ సంఘాల నాయకులు నయీమ్ ఖురేషి, అబిద్ హుస్సేన్, అబ్దుల్ రబ్, అన్వార్ పాషా, యాసీన్, ఎండి యూసుఫ్, ఖమర్, ఫారూఖ్, అమీర్ ఖాద్రి, ఇస్మాయిల్, షకీల్, ఇమ్రాన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :