తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థకు జెన్కో నుండి రావాల్సిన 53 వేల కోట్లు బకాయిలు వెంటనే వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్.సింగరేణి కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటీవల డైరెక్టర్ (పా)తో జరిగిన చర్చల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పాల్గొన్నారు.ఆదివారం ఉదయం కొత్తగూడెం శేషగిరిభవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని చర్చల వివరాలను నాయకులకు వెల్లడించారు,అదేవిధంగా సింగరేణి గనుల్లో ఉత్పత్తి టార్గెట్ కోసం కార్మికుల పై ఒత్తిడికి జీవో ల జారీనీ మానుకోవాలి,కనీస సౌకర్యాలు, కొత్త యంత్రాలు లేకుండా ఉత్పత్తి పై ఒత్తిడి కి మల్టీ డిసిప్లినరీ కమిటీలు సరైన పడ్డతికదుఅని అన్నారు, గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల వాటా ప్రకటించకుండా యాజమాన్యం మభ్య పెడుతుందని మండిపడ్డారు,అదేవిధంగా మెడికల్ బోర్డ్ పై చర్చల్లో యాజమాన్యం ఒప్పుకున్న విధంగా, పాత పద్దతి లో మెడికల్ బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని కోరారు,మరియు పాత గనులు మూతబడుతున్నాయని, ఓబీ లను సింగరేణి టేక్ ఓవర్ చేసుకొని సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో సింగరేణి ప్రాజెక్ట్ ల పై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని యాజమాన్యాన్ని కోరారు,మరియు అధికార పార్టీ అనుబంధ ఐ ఎన్ టి యు సి తప్పుడు ప్రచారాలతో కార్మికులను మభ్యబెడుతున్నారని,అదేవిధంగా కేంద్రం నూతన లేబర్ కోడ్ లను సింగరేణి లో వ్యతిరేకిస్తున్నాం ముక్తకంఠంతో తెలిపారు,మరియు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మల్టీ డిపార్ట్మెంట్ మీటింగ్ లో పనిగంటలు పెంపు చేసి కార్మికుల మీద పని భారం మోపడం కాదు ముందు మన్ పవర్ పెంచి పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను సమకూర్చాలని అన్నారు,మరియు ఐ ఎన్ టీ యు సి నాయకులు కాంగ్రెస్ మంత్రుల వద్ద ఫోటోలకు పోజులు ఇస్తూ ఉత్తిమాటలు చెప్తూ మభ్యపెట్టుడు కాదు అధికార పార్టీగా ఉన్నమేరు సింగరేణి కి జెన్కో ల నుండి రావాల్సిన 53 వేల కోట్లు బకాయిలు వసూలు చేయాలని సవాల్ విసిరారు,కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎఐటియుసి నిరంతరం పోరాటం చేస్తుందని, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తూ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందని కావున కార్మికులు గమనించాలని కోరారు,ఈ కార్యక్రమం లో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శిలు మధు కృష్ణ, కమల్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ