Monday, 03 August 2026 12:50:13 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను సింగరేణి యాజమాన్యం వెంటనే ప్రకటించాలి.

Date : 17 May 2026 06:09 PM Views : 271

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థకు జెన్కో నుండి రావాల్సిన 53 వేల కోట్లు బకాయిలు వెంటనే వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్.సింగరేణి కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటీవల డైరెక్టర్ (పా)తో జరిగిన చర్చల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పాల్గొన్నారు.ఆదివారం ఉదయం కొత్తగూడెం శేషగిరిభవన్‌ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని చర్చల వివరాలను నాయకులకు వెల్లడించారు,అదేవిధంగా సింగరేణి గనుల్లో ఉత్పత్తి టార్గెట్ కోసం కార్మికుల పై ఒత్తిడికి జీవో ల జారీనీ మానుకోవాలి,కనీస సౌకర్యాలు, కొత్త యంత్రాలు లేకుండా ఉత్పత్తి పై ఒత్తిడి కి మల్టీ డిసిప్లినరీ కమిటీలు సరైన పడ్డతికదుఅని అన్నారు, గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల వాటా ప్రకటించకుండా యాజమాన్యం మభ్య పెడుతుందని మండిపడ్డారు,అదేవిధంగా మెడికల్ బోర్డ్ పై చర్చల్లో యాజమాన్యం ఒప్పుకున్న విధంగా, పాత పద్దతి లో మెడికల్ బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని కోరారు,మరియు పాత గనులు మూతబడుతున్నాయని, ఓబీ లను సింగరేణి టేక్ ఓవర్ చేసుకొని సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో సింగరేణి ప్రాజెక్ట్ ల పై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని యాజమాన్యాన్ని కోరారు,మరియు అధికార పార్టీ అనుబంధ ఐ ఎన్ టి యు సి తప్పుడు ప్రచారాలతో కార్మికులను మభ్యబెడుతున్నారని,అదేవిధంగా కేంద్రం నూతన లేబర్ కోడ్ లను సింగరేణి లో వ్యతిరేకిస్తున్నాం ముక్తకంఠంతో తెలిపారు,మరియు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మల్టీ డిపార్ట్మెంట్ మీటింగ్ లో పనిగంటలు పెంపు చేసి కార్మికుల మీద పని భారం మోపడం కాదు ముందు మన్ పవర్ పెంచి పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను సమకూర్చాలని అన్నారు,మరియు ఐ ఎన్ టీ యు సి నాయకులు కాంగ్రెస్ మంత్రుల వద్ద ఫోటోలకు పోజులు ఇస్తూ ఉత్తిమాటలు చెప్తూ మభ్యపెట్టుడు కాదు అధికార పార్టీగా ఉన్నమేరు సింగరేణి కి జెన్కో ల నుండి రావాల్సిన 53 వేల కోట్లు బకాయిలు వసూలు చేయాలని సవాల్ విసిరారు,కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎఐటియుసి నిరంతరం పోరాటం చేస్తుందని, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తూ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందని కావున కార్మికులు గమనించాలని కోరారు,ఈ కార్యక్రమం లో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శిలు మధు కృష్ణ, కమల్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :