Wednesday, 16 September 2026 08:14:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 30 January 2025 07:34 PM Views : 966

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారి సూచనలతో సబ్ డివిజన్ పోలీసులు వాహనదారులకు,విద్యార్థినీ,విద్యార్థులకు ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా భారీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు.ఎస్పీ గారితో పాటు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,కొత్తగూడెం మున్సిపల్ కమీషనర్ శేషాంజనేయ స్వామి,జిల్లా రవాణాధికారి వెంకట రమణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందుగా విద్యార్థులతో కలిసి అక్కడ రోడ్డు భద్రతా నియమాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.వాహనదారులందరూ హెల్మెట్,సీట్ బెల్ట్ లు ధరించి వాహనాలను నడపాలని కోరారు.ర్యాష్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఓవర్ లోడ్,రాంగ్ రూట్లో ప్రయాణించడం లాంటి తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 కు పైగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలతో సహా హాజరయ్యారు

వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సోదరులు కూడా ఖాకీ యూనిఫామ్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరవడంతో ప్రకాశం స్టేడియం ప్రాంగణమంతా ఖాకీమయమైందని అన్నారు.ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు.పోలీస్ శాఖతో పాటు ప్రజలతో నిరంతరం ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండేది ఆటో డ్రైవర్లు మాత్రమే అని అన్నారు.పోలీసు వారు సూచించిన నియమాలను పాటించి ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మరియు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా కూడా మెలగాలని కోరారు.అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఆటోలకు సంబంధించి పోలీస్ శాఖ తరపున తయారుచేసిన స్టిక్కర్లను ఎస్పీ ఆవిష్కరించారు.ఆటో డ్రైవర్ల అందరూ కూడా తమ సమాచారంతో కూడిన స్టిక్కర్లను కచ్చితంగా అమర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం మరియు జిల్లా పౌరసంబంధాల శాఖ కళాకారుల చేత ట్రాఫిక్ అవగాహనపై పాటల రూపంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రాఫిక్ ఎస్ఐలు నరేష్,మదార్ మరియు పట్టణ సీఐలు కరుణాకర్,రమేష్,శివ ప్రసాద్ మరియు జూలూరుపాడు సీఐ ఇంద్రశేనారెడ్డి లను శాలువాలతో ఎస్పీ సత్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :