Friday, 18 September 2026 04:54:52 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

Date : 24 July 2026 07:10 PM Views : 150

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ రాజీనామా చేయాలి. కొత్తగూడెం అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర విద్యా శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం.ఈరోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను అమరవీరుల స్తూపం దగ్గర దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎ.ఐ.ఎస్.ఎఫ్, జిల్లా కార్యదర్శి వరక అజిత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగ కృష్ణ పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి జె.గణేష్, పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు అరుణ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర బి.జె.పి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మూడుసార్లు (2017,2021,2024)సార్లు నీట్ పేపర్ లీక్ జరిగింది. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా పరీక్ష ఎన్ని సార్లు లీక్ కావడం దేశ చరిత్రలో ఈ ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. పేపర్ లీక్ చేస్తున్నవారు బి.జె.పి ప్రభుత్వానికి అనుసనందంగా ఉన్నవారే అవడం గమనార్హం.22.75 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారని పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ భవిష్యత్ త్తు అంధకారంలో పడిందని, పేపర్ లీక్ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ ముట్టడికి శాంతి యుతంగా నిరసనకు వెళ్లిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసి పోలీసుల చేత విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయించిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమ్మనవేయంగా ప్రవర్తించిందని, దేశ భవిష్యత్తు మార్గదర్శకం కావలసిన విద్యార్థులు ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు తెలియజేస్తున్నారని దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించాలనీ వారు అన్నారు. నీట్ లీక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి కింద న్యాయం చేయాలని వారి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు విజయ్,జీవన్, ప్రేమ్, వినయ్,ప్రవీణ్, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు మాణిక్యాల వినయ్, గుండాల సుజన్,ఎస్.ఎఫ్.ఐ నాయకులు సాయి సంతోష్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :