Sunday, 02 August 2026 01:16:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పడమటి నరసాపురంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్ లక్ష్మీ కుమారి.

Date : 03 February 2026 08:08 PM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుమండల పరిధి పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి ఏపీఓ రామారావు, గ్రామ కార్యదర్శి బి హారిక తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఓ రామారావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వ కొలతల ప్రకారం ప్రతి ఇద్దరూ నాలుగు మీటర్లు పొడవు, నాలుగు మీటర్లు వెడల్పు పనిచేస్తే ఒక్కొక్కరికి 307 రూపాయలు వేతనం ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. లేదా రోజుకు 8 గంటలు పనిచేయడం ద్వారా పై వేతనం పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు పని ప్రారంభంలో, పని ముగిసే సమయంలో అందరి హాజరు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నర్సాపురం పంచాయతీలో ఏడు గ్రూపులు, మూడు ప్రాంతాలలో మొత్తం 92 మంది పనిచేస్తున్నారని అన్నారు. గ్రూపుల హాజరు నమోదుకు నూతన మేట్ లను నియమించనున్నట్లు తెలిపారు. పనికి కావలసిన పలుగు, పార లు గ్రామాలకు సరఫరా చేయడం జరిగిందని, త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామంలో ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగివున్న ప్రతి ఒక్కరూ పనిలో పాల్గొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు. కార్యక్రమంలో ఈసీ సైదులు, టిఏ నాగమణి, ఎఫ్ఏ రవి, సంఘం చిన్న రాజు తోపాటు, ఉపాధి హామీ కూలీలు, పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :