Thursday, 17 September 2026 09:13:55 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలోని ఆదివాసీ ప్రజలను అన్ని రంగాల్లో ముందుంచడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం , ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 09 August 2025 05:36 PM Views : 708

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు ఆదివాసీ నాయకులు ప్రజలు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం కొత్తగూడెం క్లబ్లో ఈ ర్యాలీ నందు పాల్గొన్న ఆదివాసీ నాయకులు ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశార. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసి జిల్లాగా పేరొందిన భద్రాద్రి జిల్లాలో నివసించే ఆదివాసి ప్రజలు అన్ని రంగాల్లో ముందుండేలా చూడడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలిపారు. ఇందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల కోసం ప్రభుత్వం తరఫున జిల్లా పోలీస్ శాఖ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసి ప్రజలకు విద్య,వైద్యం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. చర్ల మండలంలోని చెన్నాపురం,పూసుగుప్ప సరిహద్దు గ్రామాల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు మొబైల్ హాస్పటల్ లను, దుమ్ముగూడెంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను,పూసగుప్ప నుండి చత్తీస్గడ్ సరిహద్దు వరకు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డును సుమారుగా మూడు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత యువతకు ఉపయోగపడే విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ శాఖ సహకారంతో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ పునరావాస పాలసీకి ఆకర్షితులై ఈ సంవత్సర కాలంలో సుమారుగా 300 మందికి పైగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు అండగా ఉంటూ వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం జిల్లాలోని ఆదివాసీ కుటుంబాల నుండి ఉద్యోగాలలో మరియు చదువులో ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా సహాపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్,చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది,ఆదీవాసీ నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :