Monday, 03 August 2026 12:28:11 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.

Date : 27 July 2026 04:42 PM Views : 78

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం.పాత్రికేయవృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.ఘనంగా 43 వసంతాల విజయోత్సవ వేడుక తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కొలువై ఉన్న జిల్లాలో, భూమాత ప్రసాదించిన బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందులో జర్నలిస్టుగా పనిచేయటం ఎంతో అదృష్టం అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ అన్నారు. 1983లో ఇల్లందులో అడుగుపెట్టి జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన సూర్యనారాయణ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం 43 సంవత్సరాల విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చిన్నప్పటినుండి తనకు జర్నలిజం అంటే చాలా ఇష్టమని పేర్కొంటూ తన పాత్రికేయ ప్రయాణం ఇల్లందులోనే ప్రారంభమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి, సమాజానికి విశేషమైన సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయవృత్తి తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనే తన పాత్రికేయవృత్తి ప్రారంభమైందని, ఈ రెండు దినపత్రికలు తనను ఒక మంచి పాత్రికేయునిగా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉండేవారని, జర్నలిస్టుల పట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం ఉండేదని, అప్పట్లో జర్నలిస్టుగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉండేదని అన్నారు. 1983లో ఇల్లందులో ఒక చిన్న మొక్కగా ఉన్న పాత్రికేయరంగం నేడు ఒక మహావృక్షంగా మారిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికారంగంలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేడు పత్రికారంగంలో సాంకేతిక విజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసాలు లేకుండా జర్నలిస్టులు వార్తావిశేషాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాత్రికేయరంగంలో అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అన్నారు. రానున్నకాలంలో మీడియారంగం ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సుదీర్ఘకాలంలో తనతో పనిచేసిన జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :