Wednesday, 16 September 2026 06:52:45 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రాంలీలా సభతో కేంద్రానికి హెచ్చరిక. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా.

Date : 31 August 2026 06:32 PM Views : 643

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాంలీలా సభతో కేంద్రానికి హెచ్చరిక.ప్రజా సమస్యలపై రాజీలేని యుద్ధం ప్రకటిస్తాం.ఢిల్లీ వేదికగా ఉద్యమ దిశానిర్దేశం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో రేపు జరగనున్న భారీ ప్రజాచైతన్య బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు గట్టి హెచ్చరిక కానుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం నుంచి తరలిన ప్రతినిధుల బృందంతో కలిసి సోమవారం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి వర్గాలు, రైతాంగం, శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గళమెత్తేందుకే ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్న పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలు, కార్మికులు, రైతులు, యువత ఏకతాటిపైకి వస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై రాంలీలా మైదానం వేదికగా సమరశంఖం పూరించనున్నట్లు వివరించారు. ఈ సభ ద్వారా దేశవ్యాప్త ప్రజా పోరాటాలకు స్పష్టమైన కార్యాచరణ, నూతన దిశానిర్దేశం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరవుతున్న ప్రతినిధులు ఈ పోరులో చురుగ్గా భాగస్వాములై కార్యాచరణను గ్రామ స్థాయికి తీసుకెళ్తారని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు సలిగంటిశ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, వి పూర్ణ చందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, అడుసుమిల్లి సాయిబాబా, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, డి. సుధాకర్, రాజబాబు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :