Thursday, 14 May 2026 12:57:17 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 29 April 2026 07:23 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి – అధికారులకు ఆదేశాలు.అన్నపరెడ్డి మండలం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత బుధవారం ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, సంబంధిత అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తున్న మాయిశ్చరైజింగ్ యంత్రం పనితీరును కలెక్టర్ పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణలో ఎలాంటి లోపాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా పరీక్షించి వెంటనే కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని సూచించారు.రైస్ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ విధానం, కొనుగోలు రిజిస్టర్ల నిర్వహణ, టోకెన్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర సమాచారం సేకరించారు. టోకెన్లను సమయానికి జారీ చేసి రైతులు అనవసరంగా వేచి ఉండకుండా చూడాలని, ప్రతి రైతుకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో సరైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమని, ప్రతి నమోదు ఖచ్చితంగా ఉండాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం రైతులకు మద్దతుగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి రైతు లాభపడేలా చూడటం అధికారుల బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం పెంట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును తనిఖీలు తాసిల్దార్ స్వర్ణ, ఎంపిడిఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :