తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 2(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధి లో గత ఐదు నెలల నుంచి సీతారామ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న మాకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదని అది కూడా మొన్న గ్రామసభలో ఒక ఎకరాకు 13.5 లక్షల రూపాయలు ఇస్తామని డిప్యూటీ కలెక్టర్ చెప్పారని అది ఆ ప్యాకేజీ మాకు వద్దని మంత్రిగారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎకరాకు 20 లక్షల రూపాయలు ప్యాకేజీ మాకు కావాలని అది కూడా మొన్న గ్రామసభలో డిప్యూటీ కలెక్టర్ పట్టాదారు పాస్ బుక్ ఉన్న వాళ్ళకి ఒక రేటు పట్టా లేనోళ్లకైతే ఇంకో రేటు ఎస్టీకి ఒక రేటు ఓ బీసీలకు ఒక రేటు అను చెప్పడం జరిగిందని అది మాకు నచ్చలేదని అందరికి సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని ఈరోజు వినోబా నగర్ గ్రామంలో రైతులు ఆందోళన చేస్తూ పనులు అడ్డుకున్నారు . గుగులోతు శ్రీనివాసరావ గుగులోతు రమేష్ చప్పుడు ప్రసాద్ ఎల్లంకి వెంకటేశ్వర్లు ముదిగొండ రమేష్ సిరికొండ నరసింహారావు సిరికొండ నాగయ్య బండారి మల్లయ్య సిరికొండ పుష్పరాజ్యం కుంచాల కోటేశ్వరరావు కుంచాల వాణి కుంచాల శివ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ