Thursday, 02 July 2026 06:58:45 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ సంఘం నూతన కమిటీ ఏర్పాటు.

Date : 06 March 2025 07:29 PM Views : 1259

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత 30 సంవత్సరాల నుండి బండారు ఎల్లయ్య గారితో ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడి ఎంతోమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి నుండి దేశ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి రైల్వే, పోలీస్, ఆర్మీ మరియు ఇతర రంగాల్లో స్థిరపడడానికి బాక్సింగ్ ఎంతో ఉపయోగపడింది ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా నుండి చాలామంది క్రీడాకారులు బాక్సింగ్ ద్వారా వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. బండారి ఎల్లయ్య గారి సహకారం వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ సంఘం ఏర్పాటుకు తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వారిచే'ఆఫిలియేషన్' పొంది భద్రాద్రి కొత్తగూడెం బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ జిల్లా కమిటీ యొక్క వివరాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సంఘ చైర్మన్ గా లగడపాటి రమేష్, అధ్యక్షులుగా ఉదయ్ కాంత్, కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఎం. రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వై. శివ సుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారులుగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అయిన కె.సంజీవరావు గారు,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారి అయిన సంగం వెంకట పుల్లయ్య గారు,టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు గారు, ఎల్టా జిల్లా అధ్యక్షులు దస్తగిరి గారు,చీఫ్ పాట్రన్ గా హైకోర్టు అడ్వకేట్ అయిన యెర్రా కామేష్ గారు, జవహర్ రెడ్డి గారు,మిత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్... ఉపాధ్యక్షులుగా షమివుద్దిన్, శ్రీకాంత్,రమేష్, శంకర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈశ్వర్, జాయింట్ సెక్రెటరీస్ గా ధారా నగేష్, అరుణ్ కుమార్, కన్నయ్య, శ్రీమూర్తులు,లీగల్ అడ్వైజర్ గా మారపాక రమేష్,ట్రెజరీగా రవీందర్,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మహేందర్, రతన్ సింగ్,దుర్గ,కిరణ్ కుమార్,శ్రీనివాస్,నవీన్ యశ్వంత్ గా జిల్లా కమిటీలో ఉన్నారు.. ఈ సందర్భంగా జిల్లా కమిటీ మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ మరియు చీప్ పాట్రన్ అయినా లగడపాటి రమేష్ మరియు యెర్రా కామేష్ మాట్లాడుతూ గ్రామీణ యువతి యువకులకు ఈ బాక్సింగ్ పట్ల సరియైన అవగాహన లేక ఈ అమూల్యమైన బాక్సింగ్ విద్యను నేర్చుకోలేక పోతున్నారు కావున వారికి అవగాహన కల్పిస్తామన్నారు.బాక్సింగ్ పట్ల ఆసక్తి కలిగిన యువతీ యువకులకు వేసవి కాలంలో ఉచిత బాక్సింగ్ శిక్షణ నిర్వహిస్తామని, బాక్సింగ్ ను నేర్చుకోవాలనుకుంటున్న క్రీడాకారులకు బాక్సింగ్ సామాగ్రిని ఉచితంగానే అందిస్తామని,క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లక్ష్యం అని చెప్పారు. వేసవి కాల ఉచిత శిక్షణలో ఎన్ ఐ ఎస్ శిక్షణ పొందిన ఈశ్వర్ మరియు జాతీయ స్థాయిలో బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన శివ సుబ్రహ్మణ్యం శిక్షకులుగా ఉంటారన్నారు. ప్రస్తుతము నేతాజీ వ్యాయామశాలలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు శమీ ఉద్దీన్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :