తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడ్పుల గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడ్పులగూడెం ఆదివాసీ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,ఇల్లందు సీఐ సురేష్,టేకులపల్లి సీఐ సత్యనారాయణ,గుండాల సీఐ తిరుపతి,ఎస్సైలు రాజేందర్,రవూఫ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీల సంక్షేమం,అభివృద్ధి కోసం పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.మత్తు పదార్థాల వినియోగం,రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్స్,పొక్సో కేసుల గురించి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం హెల్మెట్ ధరించి మాత్రమే ద్విచక్ర వాహనాలను నడపాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అనంతరం ఎస్పీ గారి చేతుల మీదుగా అక్కడ నివసించే 100 కుటుంబాల వారికి హెల్మెట్లు,దుప్పట్లు పంపిణీ చేశారు.పిల్లలకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలోని యువతకు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంటును ఎస్పీ ప్రారంభించారు.అనంతరం కొమరారం పోలీస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ విధులలో ఉండే అధికారులు,సిబ్బంది కొరకు నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ క్వార్టర్స్ పనులను పరిశీలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ