Saturday, 18 April 2026 06:29:54 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

ఆదివాసీ ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

Date : 22 January 2026 07:08 PM Views : 228

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడ్పుల గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడ్పులగూడెం ఆదివాసీ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,ఇల్లందు సీఐ సురేష్,టేకులపల్లి సీఐ సత్యనారాయణ,గుండాల సీఐ తిరుపతి,ఎస్సైలు రాజేందర్,రవూఫ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీల సంక్షేమం,అభివృద్ధి కోసం పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.మత్తు పదార్థాల వినియోగం,రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్స్,పొక్సో కేసుల గురించి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం హెల్మెట్ ధరించి మాత్రమే ద్విచక్ర వాహనాలను నడపాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అనంతరం ఎస్పీ గారి చేతుల మీదుగా అక్కడ నివసించే 100 కుటుంబాల వారికి హెల్మెట్లు,దుప్పట్లు పంపిణీ చేశారు.పిల్లలకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలోని యువతకు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంటును ఎస్పీ ప్రారంభించారు.అనంతరం కొమరారం పోలీస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ విధులలో ఉండే అధికారులు,సిబ్బంది కొరకు నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ క్వార్టర్స్ పనులను పరిశీలించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :