Saturday, 18 April 2026 05:01:31 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

800 రోజుల్లో చేయలేనిది 99 రోజుల్లో చేస్తారా కాపు సీతాలక్ష్మి.

Date : 06 March 2026 07:18 PM Views : 272

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 800 రోజుల్లో చేయలేనిది ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల్లో సాధించగలరా అని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పేరు మార్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాపుల్లో పెట్టారని, ఆ యాప్ లో కూడా యూరియా దొరకక రైతులు రైతు వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి హడావిడి సృష్టించడం తప్ప ఒక్క పని పూర్తి చేసిన పాపాన పోలేదని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేదని, రూ.2వేల నుంచి 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ ఊసేత్తడం లేదని విమర్శలు గుప్పించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వాగ్దానం ఇచ్చి వారికి నేటికి ఇస్తానన్న రూ.2500 కూడా ఇవ్వలేదని అన్నారు. చదువుకుంటున్న యువతులకు స్కూటీలు ఎక్కడా..?, అలాగే నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువవికాసం పేరిట అప్లికేషన్లు స్వీకరించి మూలన పడేశారని పేర్కొన్నారు. ఏడాది లోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని తెలిపారు. దాంతో ఈరోజు భద్రాద్రి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కి నిరసన చేపట్టిన దాఖలాలు కళ్ళముందు కట్టినట్టు కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కొత్తగూడెం మున్సిపల్ కార్మికులకు అందాల్సిన అలవెన్స్ లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :