తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ శనివారంతో పదవీ విరమణ పొందిన సూర్యనారాయణ గారిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.స్పెషల్ బ్రాంచ్ నందు ఎస్సైగా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు.37 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన సూర్యనారాయణ సేవలు ప్రశంసనీయం అని అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అన్నారు.గత 37 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ తాము సాధించిన అనుభవాన్ని పదవీ విరమణ పొందిన సూర్యనారాయణ ఎస్పీకి వివరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ మల్లయ్య స్వామి,ఏఓ మంజ్యా నాయక్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ