తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నాడు ఇతర యూనియన్ల నుండి ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లో చేరినారు. ఈ సందర్భంగా ఏఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి SV రమణ మూర్తి,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణ ఫర్,టి నాగయ్య ల సమక్షంలో కాంట్రాక్ట్ కార్మికులు ఏఐటీయూసీ కండవాలు కప్పుకొని యూనియన్ లో జాయిన్ అయినారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కు అనేక సంవత్సరాలుగా పోరాటాల ద్వారా కనీస వేతనాలు,సీఎంపిఎఫ్, బ్యాంకు జీతాలు,లాభాల్లో వాటా, పెనాల్టీ విధానంలో మార్పులు తదితర హక్కులను సాధించడంలో ఏఐటియుసి ది కీలక పాత్ర అని అన్నారు. భవిష్యత్తులో వేతనాల పెంపుదల,ఉద్యోగ భద్రత, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం AITUC పోరాడుతుందని,కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. ఇతర యూనియన్ ల నుండి ఏఐటియుసి లో చేరిన వారికి ఎల్లప్పుడూ యూనియన్ నాయకుల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.యూనియన్ లో చేరిన వారిలో ముఖ్యులు ఏ ప్రభాకర్,కిషన్,ఇంతియాజ్,నాగరాజ్,దివ్య, ప్రణయ్, సాయికిరణ్, దీపక్, శ్రావణి, ముంతాజ్ తదితరులు చేరినారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు హుస్సేన్, మంజు,గోవింద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ