తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావు నియామకం.జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా (Official Spokesperson) తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు.తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి డా. గడల శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా, హుందాగా, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.” అని తెలిపారు.ప్రజాసేవే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, “బాధ్యత మారవచ్చు… కానీ నా లక్ష్యం ఒక్కటే ~ ప్రజలే ప్రథమం, ప్రజాసేవే పరమావధి” అని స్పష్టం చేశారు.తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ, పార్టీకి–ప్రజలకు మధ్య బలమైన వారధిగా పనిచేస్తానని డా. గడల శ్రీనివాసరావు తెలిపారు.తనపై నమ్మకం ఉంచిన పవన్ కళ్యాణ్ కి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరికి, పార్టీ నాయకత్వానికి, అలాగే తనకు నిరంతరం అండగా నిలుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ