Wednesday, 16 September 2026 08:25:27 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయొద్దు.ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి జిల్లా సహాయ కార్యదర్శి వినయ్.

Date : 18 August 2026 06:37 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయొద్దు.స్కిల్ వర్సిటీకి అనుసంధానం ఆపాలి.లాటరల్ ఎంట్రీ రద్దు నిర్ణయం సరికాదు.ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొడతాం. ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి జిల్లా సహాయ కార్యదర్శి వినయ్. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడటం తగదని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ ముసుగులో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల ఆస్తులను ప్రైవేటీకరించడం పూర్తిగా అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాసే అర్హత కోల్పోయి, కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పనిచేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఎంతో కాలంగా అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1957 నుంచి ఎంతో మంది సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు సలిగంటి జయదీప్, రామ్ చరణ్, సాయి రామ్, వడ్డేబోయిన యశ్వంత్, ముదిగొండ నిరీక్షణ, సన్నీ, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :