Monday, 03 August 2026 12:27:21 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 58 మంది బాలకార్మికులకు విముక్తి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 31 January 2026 05:19 PM Views : 228

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 01.01.2026 నుండి 31.01.2026 వరకు జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పరిశ్రమలు,వ్యాపార సముదాయాలలో దాడులు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు బృందాలను ఈ దాడులను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని,నెల రోజుల పాటు జరిగిన ఈ దాడులలో భాగంగా మొత్తం 58 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి విముక్తి కలిగించడం జరిగిందని తెలిపారు.ఇందులో 09 మంది బాలికలు ఉండగా 49 మంది బాలురు ఉన్నారు.ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 04 బాలికలు, 27 మంది బాలురలను గుర్తించినట్లు తెలిపారు.బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.జిల్లాలో మొత్తం 36 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఆపరేషన్ స్మైల్ -XII బృందం పట్టుకున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగిందని తెలియజేసారు.అనంతరం పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 నకు గానీ 1098కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఆపరేషన్ స్మైల్ -XII నకు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి నోడల్ అధికారిగా వ్యవహరించారు.ఆపరేషన్ స్మైల్ బృందంలో పనిచేసి బాలకార్మికులకు విముక్తి కలిగేలా బాధ్యతలు నిర్వర్తించిన షీటీం ఇన్స్పెక్షర్ రాము,ఆరెఎస్సై రమాదేవి,ఎస్సైలు విజయ,సతీష్,శ్రావణ్,రాఘవయ్య,సమ్మిరెడ్డి,లక్ష్మణ్,ఏఎస్సై నాగయ్య,పీసీలు మల్లికాంబ,రాంబాబులను ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :