Saturday, 18 April 2026 06:28:35 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 58 మంది బాలకార్మికులకు విముక్తి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 31 January 2026 05:19 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 01.01.2026 నుండి 31.01.2026 వరకు జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పరిశ్రమలు,వ్యాపార సముదాయాలలో దాడులు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు బృందాలను ఈ దాడులను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని,నెల రోజుల పాటు జరిగిన ఈ దాడులలో భాగంగా మొత్తం 58 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి విముక్తి కలిగించడం జరిగిందని తెలిపారు.ఇందులో 09 మంది బాలికలు ఉండగా 49 మంది బాలురు ఉన్నారు.ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 04 బాలికలు, 27 మంది బాలురలను గుర్తించినట్లు తెలిపారు.బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.జిల్లాలో మొత్తం 36 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఆపరేషన్ స్మైల్ -XII బృందం పట్టుకున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగిందని తెలియజేసారు.అనంతరం పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 నకు గానీ 1098కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఆపరేషన్ స్మైల్ -XII నకు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి నోడల్ అధికారిగా వ్యవహరించారు.ఆపరేషన్ స్మైల్ బృందంలో పనిచేసి బాలకార్మికులకు విముక్తి కలిగేలా బాధ్యతలు నిర్వర్తించిన షీటీం ఇన్స్పెక్షర్ రాము,ఆరెఎస్సై రమాదేవి,ఎస్సైలు విజయ,సతీష్,శ్రావణ్,రాఘవయ్య,సమ్మిరెడ్డి,లక్ష్మణ్,ఏఎస్సై నాగయ్య,పీసీలు మల్లికాంబ,రాంబాబులను ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :