Thursday, 14 May 2026 02:25:20 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

రామవరం మార్కెట్ సెంటర్ లో గుంతలను పూడిపిస్తున్నసిపిఐ నాయకులు

Date : 14 August 2025 04:38 PM Views : 607

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం పట్టణ ప్రాంతంలో ఇంటింటికి నీటిని అందించే క్రమంలో మిషన్ భగీరథ పైపులు వేయటం కోసమై రామవరం మార్కెట్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో పొక్లిన్తో సి సి రోడ్డును తవ్వి పైపులు వేసి అదే మట్టితో కుంటను కూర్చోడం వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల మట్టి మొత్తం లోనికి దిగబడి సీసీ రోడ్డు గొయ్యి లాగా ఏర్పడి చాలామంది బాటసారిలు పడిపోవడం జరిగింది. కార్పొరేషన్ వారు గానీ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను మందలించడంతో యుద్ధ ప్రాతిపదికన గుంటలు కూర్చోటం జరిగిందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ విషయంపై మునిగడప వెంకటేశ్వర్లు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ఈ సమస్య తక్షణమే తీర్చకపోతే జరగబోయే పరిణామాలకు కాంట్రాక్టర్ బాధ్యుడు అవుతాడని అన్నారు. శాసనసభ్యుల అధికారులకు ఇచ్చిన ఆదేశానుసారం సంబంధిత కాంట్రాక్టర్ సదరు గొయ్యులను సిమెంట్ యాస్ తో పూడ్చడానికి వారి సిబ్బందిని పంపించడం జరిగింది అని ఆయన తెలిపారు .రోడ్డుపూడ్చే కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, కొత్తగూడెం టు టౌన్ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామవరం సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు అజ్మీరా బాలాజీ నాయక్,లు గుంతలు పూడ్చే పనులను పర్యవేక్షించారు. భవిష్యత్తులో పైప్ లైన్ వేయడానికి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వస్తే గొయ్యి తీసిన వెంటనే కాంక్రీట్ తో పూడ్చాలని బాటసారులకు ఇబ్బంది కలగకూడదని అందుకు జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నదని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :