తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ రైతులు వేసిన పంట చేతికొచ్చే తరుణంలో మార్కెట్లో దళారులచే దోపిడీకి గురవుతున్న తరుణంలో ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును చూస్తే రైతు తెచ్చిన అప్పు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు రైతు వేసిన పంటకు అయిన పెట్టుబడికి లెక్క గట్టి ప్రభుత్వం తగు పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా ఆ దిశలో ప్రభుత్వాలు లేవని వారు అన్నారు స్వామినాథ కమిషన్ సిఫార్సు ప్రకారంగా ప్రభుత్వాలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 50% లెక్క గట్టి రైతుల పంటకు మద్దతు ధర కల్పించే అవకాశం ఉందని వారు గుర్తు చేశారు పత్తి పంట విక్రయించేందుకు మార్కెట్కు వెళ్ళితే సరైన ధర పలకటం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరు చూస్తే రైతుల నట్టెడ ముంచే పద్ధతులను అనుసరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చి మార్కెట్ కు వెళితే దళారులచే మోసపోతున్నారని దోపిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దళారుల వ్యవస్థను అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని వారు గుర్తు చేశారు పత్తి పంట కింటాకు 10000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మొక్కజొన్నకు కింటాకు 3500 ఇవ్వాలని అన్న రూ . జూలూరుపాడు మండలంలో ఉప మార్కెట్.గా ఉన్న మార్కెట్ యార్డును ఏనుకూరు మండలం నుండి విడదీసి జూలూరుపాడు మండల శ్వాస త మార్కెట్ యార్డును తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పై డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అన్ని వర్గాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు దేశానికి రైతే రాజు రైతు లేనిది రాజ్యం లేదని పాలకులు ఎన్నో వాగ్దానాలు చేస్తున్న అవి ఆచరణలో అమలుకు నోచుకోవట్లేదని రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవత తల్లి ప్రేమను చూపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అనేక సబ్సిడీలు అనేక సంక్షేమ పథకాలు వర్తింప చేసే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎదలపురం. గోపాలరావు రైతు సంఘం జిల్లా నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు లింగాల. వీరభద్రం మండల నాయకులు రాయల.సీదు ఎం. కృష్ణయ్య పైద .వెంకటేశ్వర్లు ఇరప.రాజు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు వెంకటమ్మ, గోపమ్మ, మండల నాయకులు సోడెం. నరసింహారావు, కృష్ణ, కల్తీ. శేఖర్, తాటి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ