తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ఓల్డ్ డిపో ఏరియాలో ఈరోజు SVS ఫిజియోథెరఫీ & డెంటల్ క్లినిక్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో సాబీర్ పాషా మాట్లాడుతూ సేవా దృక్పధంతో ప్రైవేటు ఆస్పత్రులు వైద్య సేవలు అందించాలని వైద్యరంగంలో కొత్తగూడెం పట్టణం బలపడటం హర్షనీయమని వైద్య సేవలు పేదవర్గాల హక్కుగా మారే రోజులు రావాలని సాబీర్ పాషా కోరారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ వెంకన్న, డా. ఉషారాణి, డా.బి గాంధీ, డా. విజయకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, ఉర్దూగర్ సెక్రటరీ షరీఫ్, ఫైజుద్దీన్, రవి, కిరణ్, తేజ, మాజీ కౌన్సిలర్లు యూసుఫ్, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణా చారి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ