Sunday, 02 August 2026 09:30:21 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రోడ్డు భద్రతపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన – ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 April 2026 01:38 PM Views : 125

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం చుంచుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6 నుండి ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి వారం వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు డీ-అడిక్షన్ మరియు కౌన్సిలింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములుగా చేసుకుంటూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు . రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని అన్నారు . ఈ గ్రామసభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించడం, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రమాదాల సమయంలో అంబులెన్స్ సేవలు సమయానికి అందుబాటులో ఉన్నాయా, సమీప ఆసుపత్రులకు కనెక్టివిటీ ఎలా ఉందనే అంశాలను కూడా ఈ గ్రామసభల ద్వారా సమీక్షిస్తున్నామని వివరించారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను తెలియజేసేలా చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్క శాఖకు సంబంధించిన విషయం కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాద రహిత జిల్లాను సాధించగలమని అన్నారు. కొన్ని జిల్లాలో అమలు చేస్తున్న “నో హెల్మెట్ – నో ఎంట్రీ” వంటి వినూత్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, అలాంటి ఆలోచనలను మన జిల్లాలో కూడా అనుసరించాలని సూచించారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని , వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామస్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్పంచ్ భూక్య శాంతి శ్రీ, తాసిల్దార్ నాగరాజు, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :