తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి 55వ డివిజన్లో పోటీలో ఉన్న వేముల అశోక్ తనదైన శైలిలో ప్రచారంలో జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఆయన ఇంటింటి కీ తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని చెప్పారు.తనకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సాదిక్ పాషా, ఆర్గనెట్ సెక్రెటరీ సాయి అనిత్, కోఆర్డినేట్ ఇంచార్జ్ త్రినాథ్, జన సైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ