Thursday, 02 July 2026 05:26:10 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

గిరిజన ప్రాంతాల్లో ఔషధ గుణాలు గల మేకపాల ఉత్పత్తి, విక్రయ కేంద్రాల ఏర్పాటు అవసరం – కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 03 July 2025 08:53 PM Views : 448

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి, మండల స్థాయి పశువైద్యాధికారులు, జిల్లా వెటర్నరీ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన గ్రామాలలో గిరిజనులు మరియు మహిళల వద్ద ఉన్న మేకల సంతతిని అభివృద్ధి చేసి అధిక పాల దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మేకపాల విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మేకపాల నుండి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి వినియోగించే పద్ధతులపై గిరిజనులు మరియు మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.

అదేవిధంగా, మేకపాలను ప్రోత్సహించడం ద్వారా మేకలు అడవుల్లో లభించే ఆకులు, చెట్లు మేతగా తీసుకోవడం వలన అడవులను రక్షించవచ్చని, అడవులు మనలను రక్షిస్తాయని కలెక్టర్ తెలిపారు. మేకల మేత కోసం అవసరమైన మొక్కలను నాటడం ద్వారా అడవుల అభివృద్ధి జరగగలదని, దీని వల్ల గిరిజనులు, మహిళలు, సమాజం మొత్తానికి లాభం చేకూరుతుందని వివరించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలను అందించడానికి ప్రత్యేకంగా మేకపాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్ ద్వారా గిరిజనులు మరియు మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు.

ఇకపై గిరిజనులు మరియు మహిళలను బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఈ చర్యల ద్వారా ఆదివాసీ కుటుంబాలు మరియు మహిళలు ఆర్థికంగా లాభపడడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం పొందగలరని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి, మండల స్థాయి పశువైద్యాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :