Wednesday, 16 September 2026 05:52:37 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి ... AITUC ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.

Date : 04 June 2025 11:35 AM Views : 562

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కు తక్షణమే నిర్ణయం తీసుకొని వేతనాలను పెంచాలని,కనీస వేతనాల సలహా మండలి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని,నిర్లక్ష్యం విడనాడాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణఫర్ లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తగూడెం కార్పోరేట్ లోని ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించి అమలు చేయడంలో, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచడంలో, కనీస వేతనాలు సలహా మండలి నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వా ఆమోదానికి సిఫారసు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు పొందిన సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వాడుకోవడానికి, లాభాలను సాధించడానికి మాత్రమే కాకుండా సంస్థ లాభాలలో, సర్వీస్ లో అత్యంత కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం విడనాడాలని,తక్షణమే వేతనాలను పెంచి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణిలో 18 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు, నర్సరీ కార్మికుల కనీస వేతనాలు అమలు, ప్రైవేటు కన్వేయన్స్ డ్రైవర్ల 15% ఆడహక్కు పేమెంటు కటింగు సమస్య,అందరికీ సీఎం పిఎఫ్ అమలు చేయడం, సీఎం పిఎఫ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వివరాలు కార్మికులకు అందజేయడం తదితర సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి,చుక్కయ్య, రాజేష్,ఆదిలక్ష్మి, మణెమ్మ,రాజేశ్వరి,లక్ పతి,రాజు,సుశీల, వెంకటేశ్వర్లు,రాము,విష్ణు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :