తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ దృష్టికి ఈటల రాజేందర్ పలు అంశాలు తీసుకువచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు అవసరం ఉంది. ఇప్పటికి మంజూరు అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు తొందరగా పూర్తిచేయాలని కోరారు. ఇంకా చాలా అవసరం ఉన్నాయి.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.. వాటిని కూడా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో గతంలో కంటే రైళ్ల వేగం, రైళ్ల ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. అది గమనించక చాలా మంది ప్రజలు పట్టాలు క్రాస్ చేస్తూ రైలు ఆక్సిడెంట్ లో చనిపోతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం అని మంత్రి దృష్టి ఈటల రాజేందర్ తీసుకువచ్చారు. ఇందుకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు. అవసరం ఉన్న ప్రతి చోట చిన్న చిన్న అండర్ పాస్ లు. 9 - 10 అడుగుల ఎత్తులో సాధ్యమైనంత ఎక్కువ వెడల్పుతో నిర్మించాలని కోరారు. ఆటోలు, స్కూటర్లు, మనుషులు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని సూచించారు. పట్టాలు తక్కువ ఎత్తులో ఉన్న చోట మనుషులు క్రాస్ చేయడానికి అనువుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జులు నిర్మాణం చేయాలని కోరారు. ఆక్సిడెంట్ జరగకుండా చూడడమే మనందరి అంతిమ లక్ష్యంగా ఉండాలని కోరారుఎంతో ఖర్చు పెట్టి రైల్వే అండర్ బ్రిడ్జిలు కట్టినా. చాలాచోట్ల వాటికి ఇరువైపులా మూడు నుండి నాలుగు అడుగుల నీరు, వర్షాకాలంలో నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలు జరగక నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దేవిని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ