Sunday, 07 June 2026 07:44:14 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 04 April 2026 05:13 PM Views : 155

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృత స్థాయి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యాసంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ క్షేత్రాలు తదితరాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి” అనిస్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు . భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, వాటిపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మొదటగా అనంతోగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, గ్రామంలో మంజూరైన 19 ఇళ్లలో ప్రస్తుతం 3 ఇళ్లు రూఫ్ స్థాయికి చేరుకున్నట్లు అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారు గలిగ నాగలక్ష్మి ఇంటి నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పనుల నాణ్యత, వినియోగిస్తున్న సామాగ్రి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి నాణ్యమైన గృహాన్ని అందించాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకుని, బయాలజీ వంటి విషయాల్లో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిన నేపథ్యంలో, ఇన్వర్టర్ ఏర్పాటు ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆళ్లపల్లి గ్రామంలో రైతు మద్దెల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించిన కలెక్టర్, సాగు విధానం, దిగుబడి, ఆదాయం వంటి అంశాలపై రైతుతో చర్చించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. మండలంలో 400 ఎకరాల లక్ష్యానికి గాను 290 ఎకరాల్లో సాగు పూర్తయిందని అధికారులు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్, మందుల గది తదితరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన అన్ని మందులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, వాటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 108 అంబులెన్స్ సేవలను కూడా పరిశీలించి, అత్యవసర సేవలపై వివరాలు సేకరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా “క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలి” అని స్పష్టం చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలోని త్రాగునీటి పరిస్థితిపై విచారించిన కలెక్టర్, మిషన్ భగీరథ ద్వారా సరఫరా సక్రమంగా కొనసాగుతున్నప్పటికీ, ఎండాకాలంలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, లేకపోతే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫాగింగ్ యంత్రాల వినియోగంపై కూడా సమీక్షించారు. మొబైల్ సిగ్నల్ సమస్యలపై విచారించగా కొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వ్యవసాయ రంగంపై సమీక్షలో భాగంగా మండలంలో సాగు అవుతున్న పంటల వివరాలు తెలుసుకున్నారు. నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, బోర్ల ద్వారా సాగునీటి అందుబాటుపై అధికారులను ప్రశ్నించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి, ప్రతి మహిళను సంఘాల్లో సభ్యురాలిగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు మెనూ పాటించకపోవడంతో పాటు ఆహార నాణ్యత లోపాలు తమ పరిశీలనలో వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, అన్ని పాఠశాలలను నిరంతర తనిఖీలు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల నీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ శాంతారావును హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్, ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :