తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడుతున్నది ఏఐవైఎఫ్ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పాలకులు విఫలం 18 ఏళ్లకే ఓటు హక్కు సాధించిన ఘనత ఏఐవైఎఫ్ ఉద్యమాలదే యువతరం మేల్కొని హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలాలి దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫహీమ్ శాస్త్రీయ విద్య, ఉపాధి గ్యారంటీ కోసం యువత నిరంతరం పోరాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎస్.కె. ఫహీమ్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫహీమ్ సమాఖ్య జెండాను ఆవిష్కరించి యువతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాజీలేకుండా పోరాడుతున్న ఏకైక సంస్థ ఏఐవైఎఫ్ మాత్రమేనన్నారు. పేదలకు మెరుగైన ఉచిత విద్య, వైద్యం అందించడంలో నేటి పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, వీటి సాధన కోసం సమాఖ్య నిరంతరం ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని పోరాడి సాధించిన ఘనత తమ సంస్థదేనని గుర్తుచేశారు. దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, యువతరం మేల్కొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. యువతకు కావాల్సిన ఉపాధి మార్గాలను ప్రభుత్వం చూపడం లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, రౌతో సురేష్, రణధీర్, కొంచెర్ల రాకేష్, నాదీమ్, కామల్, కొయ్యడ రవి, నాగరాజు, వినయ్ కుమార్, వంశీ, సంజయ్, శ్రీకాంత్, సన్నీ, ఆశ్రఫ్, చిన్ను, దుర్గ, శివ, హుజఫా, అన్వేష్, సెల్వార్ స్టార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ