Thursday, 17 September 2026 06:42:24 PM
# అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ.

బిడ్డలకు జన్మనిచ్చి భరతమాతను కాపాడే ఓ తల్లి నీకు ఇదే మా వంద నాలు ఉన్నందాస్ గడ్డలో ఘనంగా మాతృ దినోత్సవం

Date : 11 May 2025 07:03 PM Views : 1003

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిడ్డలకు జన్మనిచ్చి భరతమాత ఒడిలో ఉన్న బిడ్డలను పహల్గామ ఉగ్ర దాడిలో శత్రుదేశం నుండి కాపాడేందుకు వీరులను పంపిన ప్రతి తల్లికి ఇదే మా పాదాంజలి. ఆపరేషన్ సింధూర్ బాధ్యతలో ఉన్న వీరవనితలు మహిళా కమాండర్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ భరతమాత సింధూరం మహాశక్తిని చూపించిన మీకు ఇవే మా వందనాలు అంటూ ఉన్నదాసు గడ్డలో మాజీ కౌన్సిలర్లు మునిగడప పద్మ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి లేనిదే మనకు జన్మ లేదని ఆ తల్లి నవ మాసాలు మోసి ఎన్నో బాధలకు ఓర్చుకొని జన్మనిచ్చిన బిడ్డలను మంచి బాటలో నడిపించాలని వారి ఎదుగుదలే తన సంతోషమని జీవిస్తుందని వారు అన్నారు . ఆ తల్లికి మనం ఎంతో రుణపడి ఉండాలని నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను చూడనటువంటి కొంత దుర్మార్గ వ్యవస్థ ఉన్నదని అలాంటి వ్యవస్థను ఈ మదర్స్ డే నుండైనా మార్చాలని అన్నారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల్లో ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు. భరతమాతను కాపాడే పదో వార్డుకు చెందిన తెలగరి అభిలాష్, బానోత్ గౌతమ్ బిడ్డలను కన్న తేలగరి మాణిక్యమని, బానోతు సుశీల తల్లులు మన ఇండియన్ ఆర్మీకి అందించి నేటి యుద్ధంలో భాగస్వాములను చేసిన వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఉన్నందాస్ గడ్డ వృద్ధాప్య తల్లులను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సూరి మేని జనార్ధన్ ,ఎస్కే జలీల్, బానోతు చందర్, సిపిఐ సీనియర్ నాయకులు కట్ట సత్యనారాయణ, అస్మత్ పాషా, షణ్ముఖ చారి ,రమేష్, మునిగడప స్వరాజ్యం, ముద్దం మార్తమ్మ, బానోతు కమల, సత్యవతి, తెలగరి సౌజన్య ,పద్మక్క, శ్రీదేవి, కవిత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :