తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దశాబ్దాల కల సాకారం.. •మారెళ్ళపాడు లిఫ్టులో గోదావరి పరవళ్లు.16 వేల ఎకరాలకు సాగునీరు.మంత్రి తుమ్మల కృషికి ఫలితం.విజయవంతమైన ట్రయల్ రన్.రైతన్నల్లో హర్షాతిరేకాలు.ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్ష పర్యవేక్షణతో గడువులోగా పూర్తి.మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెరుస్తున్న ఆశ నేడు సాకారమైంది. వానలు సరిగా కురవక, భూగర్భ జలాలు అడుగంటి బీడుగా మారిన భూములకు గోదావరి తల్లి నీరు అందించాలన్న రైతన్నల చిరకాల వాంఛ మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రూపంలో నెరవేరింది. ఈ పథకం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలోని 16 వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు ఇక సాగునీటికి కొదవ ఉండదన్న భరోసా లభించింది.మంత్రి తుమ్మల కృషి ఫలించింది.సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి నుంచే ఈ ప్రాంత రైతుల గోడు తెలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మలచెరువుతో పాటు అశ్వాపురం మండలాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో మారెళ్ళపాడు ప్రాజెక్టు ప్రతిపాదనలకు ప్రాణం పోశారు. మొదటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడే అంచనాలు రూపొందించి, రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపాదనలకు మంజూరు తెప్పించారు. అప్పటి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేసినా, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు మూలనపడుతుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే రైతు పక్షపాతిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి కావడంతో పరిస్థితి మారింది. ఒకటికి పదిసార్లు ప్రాజెక్టును సందర్శించి, అధికారులను పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించారు.ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ.పనులు గడువులోగా పూర్తయ్యేలా చూడాలంటూ మంత్రి తుమ్మల.. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. ఆగస్టు నెలాఖరుకల్లా తుమ్మలచెరువుకు నీళ్లు అందించి తీరాలన్న మంత్రి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దాదాపు 20 రోజులపాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే మకాం వేసి పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఫలితంగా నిర్ణీత గడువులోగానే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రైతుల్లో ఆనందోత్సాహాలు,దశాబ్దాల కల నెరవేరడంతో తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పనులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇంకా సాగునీరు అందని ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రైతుల తరఫున పినపాక నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, తుమ్మల వీరాభిమాని కోలేటి భవానీశంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.ప్రాజెక్టు ముఖచిత్రం.మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.113.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకంలో మెయిన్ కెనాల్ పొడవు 9.850 కి.మీ. ఉండగా, తొలిదశలో 7 వేల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు చేశారు. సీతారామ మెయిన్ కెనాల్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ నీటిని అందిస్తారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో ప్రాజెక్టు తుది రూపు సంతరించుకుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ