Friday, 18 September 2026 12:31:48 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జల్ సంచయ్ జన్ భాగీదారీలో జిల్లా కు ప్రత్యేక గుర్తింపు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 26 September 2025 05:14 PM Views : 184

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం మరియు జిల్లా కు ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న “జల్ సంచయ్ జన్ భాగీదారీ – 1.0” కార్యక్రమం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందడం, రూ.25 లక్షల నగదు బహుమతి లభించడం గర్వించదగిన విషయం అని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలో 32000 నిర్మాణాలు చేపట్టి,29103 నీటి సంరక్షణ పనులు పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు.ఇంకుడు గుంతలు, నీటికుంటలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ పనులు కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాకుండా పట్టణ ప్రాంతాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పనులు, పంట నీటి కుంటలు వంటి కార్యక్రమాల్లో కూడా వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమే ఈ గుర్తింపు అని ఆయన వివరించారు.జిల్లా ప్రజల సహకారం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, గ్రామీణ అభివృద్ధి సంస్థల కృషి వలన ఈ విజయాన్ని సాధించగలిగామని కలెక్టర్ అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల నిల్వ పెంపు, పంటల ఉత్పాదకతలో స్థిరత్వం సాధించడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.భవిష్యత్తులో మరింత విస్తృతంగా వర్షపు నీటి సంరక్షణ పనులను కొనసాగించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీటి వనరుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సందర్భంగా తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :