తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఈరోజు జిల్లాస్థాయిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద 8 రకాల పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్ గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వికసిత్ భారత్ సాధించడానికి యువత పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. యువత డ్రగ్ తీసుకోవడంలో భద్రాచలం ముందు ఉందని, అందులోనూ చత్తీస్గడ్ బార్డర్ దగ్గర ఉండడంతో యువత అనేది చేజారిపోతుందని వారికి సరైన అవగాహన లేకపోవడంతో చదువుకోకుండా వారు తప్పుదారి పడుతున్నారని, నా దగ్గర వచ్చే కేసులో ఎక్కువగా యూత్ ఉన్నారు. యువత మీద ఒకసారి పోలీస్ కేస్ పడితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు వేరే దేశాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారు, మన భారతదేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత్వము, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, ఉపన్యాస పోటీలు, గ్రూపు డాన్స్, గ్రూప్ సాంగ్, షార్ట్ ఫిలిం లేదా రీల్, స్కిట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు పెయింటింగ్- పి. అనూష, షార్ట్ ఫిలిం/రీల్స్ - బి. రమ్య, కవిత రచన- జి. అక్షయ, స్లోగన్ రైటింగ్- ఇ. కళ్యాణి, ఉపన్యాస పోటీలు- బి. పద్మావతి, నాటకం - కె. స్రవంతి అండ్ టీం, గ్రూప్ డాన్స్- సిహెచ్. నీలిమ అండ్ టీం , గ్రూప్ సాంగ్- పి. ధన్మిక అండ్ టీం. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి వెంకట రాంబాబు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్, ప్రొఫెసర్ జాన్ మిల్టన్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, డాక్టర్ వేముల కామేశ్వరరావు ఎన్ ఎస్ ఎస్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి ఎం.వెంకట్ రాంబాబు, జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుఖ్ ఇమ్రాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ