Saturday, 01 August 2026 11:50:45 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు.

Date : 31 July 2026 06:55 PM Views : 22

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఈరోజు జిల్లాస్థాయిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద 8 రకాల పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్ గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వికసిత్ భారత్ సాధించడానికి యువత పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. యువత డ్రగ్ తీసుకోవడంలో భద్రాచలం ముందు ఉందని, అందులోనూ చత్తీస్గడ్ బార్డర్ దగ్గర ఉండడంతో యువత అనేది చేజారిపోతుందని వారికి సరైన అవగాహన లేకపోవడంతో చదువుకోకుండా వారు తప్పుదారి పడుతున్నారని, నా దగ్గర వచ్చే కేసులో ఎక్కువగా యూత్ ఉన్నారు. యువత మీద ఒకసారి పోలీస్ కేస్ పడితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు వేరే దేశాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారు, మన భారతదేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత్వము, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, ఉపన్యాస పోటీలు, గ్రూపు డాన్స్, గ్రూప్ సాంగ్, షార్ట్ ఫిలిం లేదా రీల్, స్కిట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు పెయింటింగ్- పి. అనూష, షార్ట్ ఫిలిం/రీల్స్ - బి. రమ్య, కవిత రచన- జి. అక్షయ, స్లోగన్ రైటింగ్- ఇ. కళ్యాణి, ఉపన్యాస పోటీలు- బి. పద్మావతి, నాటకం - కె. స్రవంతి అండ్ టీం, గ్రూప్ డాన్స్- సిహెచ్. నీలిమ అండ్ టీం , గ్రూప్ సాంగ్- పి. ధన్మిక అండ్ టీం. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి వెంకట రాంబాబు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్, ప్రొఫెసర్ జాన్ మిల్టన్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, డాక్టర్ వేముల కామేశ్వరరావు ఎన్ ఎస్ ఎస్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి ఎం.వెంకట్ రాంబాబు, జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుఖ్ ఇమ్రాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :