తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం II అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన C.C. No.429/2017 చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఫిర్యాదుదారు తనకు రావలసిన మొత్తానికి సంబంధించి నిందితుడు జారీ చేసిన చెక్కు బ్యాంకులో సమర్పించగా, అది “Funds Insufficient” కారణంతో డిషానర్ అయిందని ఆరోపిస్తూ, Negotiable Instruments Act, 1881లోని Section 138 read with Section 142 కింద ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తన వాదనకు అనుకూలంగా సాక్ష్యాలు సమర్పించగా, నిందితుడి తరఫున న్యాయవాది పాల రాజశేఖర్ కేసులోని అంశాలను సమర్థవంతంగా వాదించారు. ముఖ్యంగా ఫిర్యాదుదారు నిరూపించాల్సిన చట్టపరమైన అంశాలు మరియు నిందితుడిపై ఉన్న ఆరోపణలు సందేహాతీతంగా నిరూపించబడలేదని నిందితుడి తరఫు వాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు, సాక్ష్యాలు మరియు రికార్డులను పరిశీలించిన అనంతరం గౌరవ II అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కొత్తగూడెం వారు 17-09-2026న నిందితుడిని Acquitted (నిర్దోషిగా విముక్తి) చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడి తరఫున సినియర్ న్యాయవాది పాల రాజశేఖర్, వాదనలు వినిపించగా జూనియర్ న్యాయవాది పి.ఇందిరా ప్రియదర్శిని న్యాయపరమైన సహకారం అందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ