Thursday, 15 January 2026 05:42:53 AM
# సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు. # జర్నలిస్టుల అక్రమ అరెస్టులుహేయమైన చర్య జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైంది కాదు. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ ఎన్నికలలొ జనసేన పోటీకి సిద్ధం. వేముల కార్తీక్. # హెచ్ పి సి కంపెనీ విజయవాడ రీజినల్ పరిధిలో గృహ అవసరాల గ్యాస్ అమ్మకం లో మొట్ట మొదటి స్థానం లో నిలిచిన సివిల్ సప్లయ్స్ పాల్వంచ ఎల్ పి జి సెంటర్. # భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 60 డివిజన్లో ముగ్గుల పోటీలు. # ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # జిల్లాలోని దుమ్ముగూడెం మరియు పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. డాక్టర్ తూకారామ్ రాథోడ్. # అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి. # ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి. ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క # మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు . # దివ్యాంగ కుటుంబానికి నిత్యావసరాలు అందజేత # 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు. # మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు : కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్. # మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ. # కెటిపిఎస్ 7 వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కె. శ్రీనివాస్ బాబు ని ఘనంగా సన్మానించిన. ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు. # TG TET–2026 పరీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం : భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు.

Date : 13 January 2026 06:36 PM Views : 25

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమం ప్రారంభోత్సవం.జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు,రవాణా,ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే Arrive-Alive-2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Arrive-Alive కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం నాడు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల పరిసర ప్రాంతాల ప్రజలు,ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.అనంతరం సుజాతనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడ పాల్గొన్న ప్రజలకు వివరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,ప్రజలు,ప్రజా ప్రతినిధులు రోడ్డు భద్రతా నియమాల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రైనీ ఆర్డీఓ మురళి,జిల్లా రవాణాధికారి భూషితా రెడ్డి, ఆర్టీసి డిఎం రాజ్యలక్ష్మి,ఎంఆర్ఓ కృష్ణ,మోటారు వాహనాల అధికారులు వెంకట రమణ,వెంకట పుల్లయ్య,వైద్యారోగ్య శాఖ అధికారులు,సీఐలు ప్రతాప్,శ్రీలక్ష్మి,వెంకటేశ్వర్లు,సుజాతనగర్ ఎస్సై రమాదేవి,ఎస్సైలు రమణారెడ్డి,ప్రవీణ్,రవి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :