తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ , అధ్యక్షులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మార్వో పుల్లయ్య గారికి మెమోరండం ఇవ్వడంఇవ్వడం జరిగింది..సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతాంగానికి అందించాలని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తాసిల్దార్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను భద్రాద్రి జిల్లా రైతాంగానికి అందించాలని కోరారు. ముగ్గురు మంత్రులు ఉండి స్థానిక రైతాంగానికి సాగునీరు ఇవ్వకపోవడం జలదోపిడి అవుతుందని చెప్పారు. జిల్లా రైతులకు సాగునీరు ఇచ్చాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలం పూర్తయిందని, 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పార్టీ పక్షాన ప్రజల పక్షాన నిరంతరం పోరాడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ కాన్సిలర్ వేముల ప్రసాద్ బాబు ,మాజీ కౌన్సిలర్ తొగరు రాజశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, జయరాం, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, ఎస్సీ సెల్ నాయకులు రావెళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, రేణిగుంట్ల రాంబాబు, సూరిబాబు, రాచపల్లి శ్రీనివాస్, సుందర్ పాసి, నిజాం, కిమ్, తలుగు అశోక్, ఎండీ రషీద్, ప్రశాంత్, చంద్రశేఖర్, మహిళా నాయకులు ఎండీ రెహనా సుల్తానా, శైలజ, సంధ్య, జ్యోతి, మాధవి, ఎండీ ఖతీజ, నందిని, కళావతి, వెన్నెల, కాత్యాయని కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ